కందుకూరు ప్రమాద బాధితులకు NRI TDP USA తరపున NRI TDP USA కోఆర్డినేటర్ కోమటి జయరాం ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రతి కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 8 కుటుంబాలకు రూ. 8 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని కోమటి జయరాం వెల్లడించారు. కందుకూరు ప్రమాదం జరగకూడని ఊహకందని విషాదం…. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చాలా సంయమనం, ధైర్యం కలిగించాలి…
తెలుగు దేశం అనేది కేవలం రాజకీయ పార్టీ కాదు ఇది మన అందరి కుటుంబం… మన తోటి వారిని అకస్మాత్తుగా కోల్పోవటం చాల బాధ కలిగించే విషయం ..వాళ్ళకు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని కోమటి జయరాం అన్నారు.