శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావంతో వరద నీటి ప్రవాహం ఉదృతం అవుతున్న నేపథ్యంలో పాలకొండ సబ్ డివిజన్ పరిధిలో లోతట్టు గ్రామాలు నీట మునిగాయి.
అన్నవరం కొండచాకి పల్లి తో పాటు పలు లోతట్టు గ్రామాలలో వరద నీటి ప్రవాహం ఎక్కువైంది. గ్రామాలకు రహదారులు నీటితో ముసుకుపోవడంతో ప్రజా రవాణా స్తంభించింది.
దాంతో ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు పాలకొండ డిఎస్పీ ఎం శ్రావణి, సంబంధిత పోలీసు అధికారులతో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు.
మునిగిపోయిన గ్రామాలకు ట్రాక్టర్ మీద చేరుకొని ప్రజలతో మమేకమై వారికి ధైర్యాన్ని ఇచ్చారు. జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలుపుతూ, బాధితులకు రేషన్, ఆహార పదార్థాలు అందించారు.