37.2 C
Hyderabad
May 6, 2024 13: 28 PM
Slider విజయనగరం

విజ‌య‌న‌గ‌రంలో టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌లు

#telugudesham

ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి,టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు,విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క రామారావు శ‌త జ‌యంతి సంద‌ర్భంగా విజ‌య‌నగ‌రంలో క‌లెక్ట‌రేట్, కోట జంక్ష‌న్, కొత్త‌పేట నీళ్ల ట్యాంక్ వ‌ద్ద ఎన్టీఆర్ విగ్ర‌హానికి టీడీపీ నేత‌లు పూల‌దండ‌లు, పాలాభిషేకం,ప్రేమ స‌మాజంలో వృద్దుల‌కు పండ్లు పంపిణీ చేసారు.

అలాగే ఎన్టీఆర్ జయంతి సందర్బంగా 1,13,4 డివిజన్ ల ఆధ్వర్యంలో కొత్తపేట నీళ్ల ట్యాంక్ వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిధులుగా టీడీపీ నగర మహిళా విభాగం కార్యదర్శి చందక స్వప్న యాదవ్, టీడీపీ నగర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొయ్యన సన్యాసిరావు, టీడీపీ లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కొయ్యన మల్లేశ్వరరావు హాజరుయ్యారు.

నిరుపేద ల కు బియ్యం, ఫ్రూట్స్, పిల్లలు కి బిస్కెట్స్, చాక్లైట్స్ పంపిణీ 13 డివిజన్ అధ్యక్షులు చందక తాతీయ్యలు ఆధ్వర్యంలో జరిగింది.ఇక పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు మాతా బుజ్జి ఆధ్వర్యంలో 46వ డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రకాష్, యువత అధ్యక్షుడు అట్టడా శ్రీను, యువత ప్రధాన కార్యదర్శి ముడాసర్ల శ్రీను తో పాటు 120 మంది కార్యకర్తలు,ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ చైర్ పర్సన్ ప్రసాదుల రామకృష్ణ, ప్రసాదుల కనక మహాలక్ష్మి , తెలుగు యువత నాయకులు గొలగాన సురేంద్ర, గంటా రవి పొల్నేటి మహేష్, షేక్ బాషా, చిగురుపాటి కుటుంబరావు, మద్దెలప్రవీణ్, కొట్టాడ శ్రీను గొల్ల కోటి శివ, పాలూరి రాజు నాయుడు, చిప్పాడా స్వామి, పూర్ణ, కామేష్, తెలుగుదేశం నాయకులు, నందమూరి ఫాన్స్ మరియు మహిళలు పాల్గొన్నారు

Related posts

చేతులు కాలాక, ఆకులు పట్టుకుంటున్న ముఖ్యమంత్రి

Satyam NEWS

రెండు పరుగుల తేడాతో నెగ్గిన టీమిండియా

Satyam NEWS

బిచ్కుందలో బిజెపిని బలోపేతం చేస్తాం

Satyam NEWS

Leave a Comment