36.2 C
Hyderabad
May 12, 2024 17: 06 PM
Slider కడప

రాజంపేట అసెంబ్లీ వ్యాప్తంగా ఘనంగా అన్నగారి జయంతి

#NTR Rajampet

కడప జిల్లా రాజంపేట టిడిపి నాయకులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 97 వ జయంతి పురస్కరించుకొని గురువారం నివాళులర్పించారు. రాజంపేట నేషనల్ హైవేలోని ఎన్టీఆర్ సర్కిల్ లో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ సుధాకర్ రాంనగర్ సంజీవ రాయుడు, కూచివారి పల్లి బాబు నాయుడు, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రచార కార్యదర్శి పోలి శివకుమార్,టౌన్ టిఎన్ఎస్ఎఫ్ స్టూడెంట్ అధ్యక్షుడు రెడ్డి నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు సేవలను వారు కొనియాడారు. అనంతరం పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులను ఎన్నారై టీడీపీ నాయకులు వేమన సతీష్ ఆదేశాల మేరకు పంపిణీ చేశారు.

కాగా నందలూరు మండలంలో మాజీ సర్పంచి సమ్మెట శివ ప్రసాద్ ,మాజీ జడ్పిటిసి శివరామ రాజు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతీ నిర్వహించారు. అదే విధంగా రాజంపేట టీడీపీ ఇంచార్జీ మాజీ ఎమ్మెల్సీ భత్యాల చెంగలరాయుడు తిరుపతి మహతి కల్యాణ మండపం సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Related posts

ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలి

Satyam NEWS

శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

Bhavani

బస్తీలలో సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు

Satyam NEWS

Leave a Comment