సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు తండు సాయిరాం గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో హుజూర్ నగర్ నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జి చావా కిరణ్మయి ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు.
అనంతరం కిరణ్మయి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన నేత ఎన్టీఆర్ అని, బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు ఎన్నో అవకాశాలు కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు రెక్కల శంభిరెడ్డి, మఠంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు నాగు నాయక్ పాల్గొన్నారు.
ఇంకా గరిడేపల్లి మండలం పార్టీ అధ్యక్షుడు కేసరి నాగయ్య ,ప్రధాన కార్యదర్శి పాతకోటి లింగరెడ్డి ,నగర పార్టీ ఉపాధ్యక్షుడు ఆవుల పాటి శ్రీను, నల్లగొండ అ పార్లమెంట్ కార్యదర్శి నల మాద శ్రీనివాస్ యాదవ్, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ రామజోగి, మేకల వెంకటేశ్వర్లు ,వేముల సీతారాములు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.