29.7 C
Hyderabad
April 29, 2024 08: 03 AM
Slider ముఖ్యంశాలు

శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

#Gold seizure

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1.725 కేజీల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులకు పక్కా సమాచారం అందింది.

దాంతో ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఇద్దరి వద్ద 1.725 కేజీల బంగారు నగలు లభ్యమయ్యాయి. వారిని అదుపులోకి తీసుకుని, బంగారాన్ని సీజ్‌ చేశారు. కాగా, బహిరంగ మార్కెట్లో ఆ బంగారం విలువ రూ.72,55,069 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Related posts

ఎమ్మెల్యే ఈటలను పరామర్శించిన బండి సంజయ్

Satyam NEWS

కర్నాటక నుంచి తెలంగాణకు వస్తున్న డూప్లికేట్ గుట్కా

Satyam NEWS

మాచినేనిపల్లి నర్సరీని సందర్శించిన కొల్లాపూర్ ఫారెస్టు రేంజ్ అధికారి

Satyam NEWS

Leave a Comment