ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు నామినేషన్ దాఖలు చేయడానికి 100 మంది పింఛన్ దారులు లక్ష రూపాయల విరాళం అందచేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మఖరా (కే) గ్రామానికి చెందిన పింఛన్ దారులు తమ విరాళాన్ని అందించాలని సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్ చేతుల మీదుగా అందచేశారు.
పింఛన్ దారులు ఒక్కొక్కరూ 1000 రూపాయలు చొప్పున విరాళం ఇచ్చారు. తమకు ప్రతి నెలా కేసీఆర్ ఇచ్చే పింఛనే ఆసరా అని, తమకు పెద్ద కొడుకులా నెల నెల పింఛన్ ఇచ్చి తమ బ్రతుకుకు భరోసాగా నిలుస్తుండని వారన్నారు.
అందుకోసమే తమ వంతు కృషిగా కేసీఆర్ కు, కేటీఆర్ కు నామినేషన్ కోసం 1000 రూపాయలు చొప్పున విరాళం ఇస్తునామ్మన్నారు. జీవితాంతం కేసీఆర్ కు రుణపడి ఉంటామని అన్నారు.