38.2 C
Hyderabad
April 29, 2024 12: 38 PM
Slider హైదరాబాద్

పోలీసులా లేక గులాబీ పార్టీకి ఏజెంట్లా?

#MadhavaramKantarao

దుబ్బాక  బీజేపీ అభ్యర్థిపై, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై తెలంగాణ పోలీసుల భౌతిక దాడిని ఖండిస్తూ నిరసనలు తెలియ చేయాలని భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు నిరసనలు తెలియ చేయకుండా ముందు జాగ్రత్త చర్యగా  ఈరోజు తెల్లవారుజామున కూకట్ పల్లి బిజెపి నేత మాధవరం కాంత రావు ను పోలీసులు  హౌస్ అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా మాధవరం కాంతారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును బీజేపీ నాయకుల పై, కార్యకర్తలపై పోలీసులు చేస్తున్న దాడిని ఖండించారు.

రోజురోజుకు తెలంగాణలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని ఆయన అన్నారు. దానికి నిదర్శనమే దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని భావించి దాన్ని తట్టుకోలేక కెసిఆర్ బిజెపి నాయకులపై, కార్యకర్తల ఇళ్ల పై పోలీసు అధికారులతో దాడి చేయిస్తున్నారని అన్నారు.

ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎలక్షన్ లో ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలంగాణలో  టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, తెలంగాణ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే అంత వరకూ బిజెపి తరపున  ఇంకా ఎన్ని ఉద్యమాలు, నిరసనలు చేయడానికి వెనకాడబోమని అన్నారు.

Related posts

జేసీ బ్రదర్స్‌కు ఊహించని షాక్‌ అంటే ఇదే

Satyam NEWS

దేవరకొండలో సర్దార్ సర్వాయి పాపన్న 370వ జయంతి

Satyam NEWS

కల్యాణ్ సింగ్ త్యాగాల ఫలితమే నేటి రామాలయం

Satyam NEWS

Leave a Comment