వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సభ్యత సంస్కారం మరచి అచ్చోసి ఆంబోతు లా ప్రవర్తిస్తున్న తీరు ఇది చూస్తూ కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఆరోపించింది. అత్యంత అసభ్యంగా మాట్లాడుతున్న అయన పై చర్యలు తీసుకోక పోగా సమర్థిస్తున్నారని వారు అన్నారు.
చంద్ర బాబు, లోకేష్ వారి కుటుంబ సభ్యులను తిట్టడం కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లుగా ఉందని వారన్నారు. కొడాలి నాని నోరు ను అదుపు చేసుకోక పోతే భవిష్యత్తు లో ఇంతకు ఇంత అనుభవిస్తారు అని తెలుగు యువత నాయకు విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి సభ్యత సంస్కారం లేని వాళ్ళని పెట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని వారు తెలిపారు.
అభివృద్ధి పైన కాకుండా చంద్రబాబు, లోకేష్ మరియు తెలుగు దేశం పార్టీ వారిని బూతులు తిడుతూ, దాడులు చేస్తూ కాలం గడుపుతున్నారని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట తెలుగు యువత అధ్యక్షులు T. నవీన్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి షేక్ అయుబ్, ఉపాధ్యక్షులు P. రెడ్డెప్ప నాయుడు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.