కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు.
మంగళవారం నియోజకవర్గంలోని నిజాం సాగర్ ప్రాజెక్టులో 16లక్షల 70వేల చేపపిల్లల పంపిణీ అనంతరం పిట్లం, జుక్కల్ మండలాల్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు , అధికారులు సంయుక్తంగా పనిచేసి జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలన్నారు. నిజాంసాగర్ కార్యక్రమం అనంతరం పిట్లం మండలంలో నూతనంగా పది లక్షల నిధులతో నిర్మించిన గెస్ట్ హౌజ్ ను ప్రారంభించారు.
అనంతరం జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ గ్రామంలోని వరిధాన్యం కొనుగోలును ప్రారంభించారు. అనంతరం జుక్కల్ మండల కేంద్రంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ పిట్లం జుక్కల్మండలాల ఎంపిపిలు జెడ్పిటిసిలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.