31.2 C
Hyderabad
May 12, 2024 00: 19 AM
Slider ఖమ్మం

ఆయిల్ పామ్ లక్ష్యం పూర్తి చేయాలి

#Collector Gautam

ఖమ్మం జిల్లాలో నిర్దేశిత ఆయిల్ పామ్ పంటల సాగు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. ఐడివోసి కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి 12,100 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటే లక్ష్యాన్ని ఏర్పరచినట్లు తెలిపారు.

జనవరి, 2023 మాసాంతానికి లక్ష్యం 8,500 ఎకరాలకు గాను 28 జనవరి, 2023 నాటికి 7,207.85 ఎకరాలలో (85%) 1,694 మంది రైతులకు సంబంధించి భూముల్లో ఆయిల్ పామ్ పంటలను సాగు చేసినట్లు ఆయన అన్నారు. ఆయిల్ పామ్ తోటలను సాగు చేసేందుకు నీటి వసతి, విద్యుతు సౌకర్యం ఉన్న భూములు కలిగిన రైతులను గుర్తించాలని ఆయన తెలిపారు. పురోగతి లేని మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

మండలం వారిగా మండల వ్యవసాయ అధికారులు ఆయిల్ పామ్ పంటల సాగుతో లాభాలు, సాగుకు వచ్చే సబ్సిడీ పై పూర్తి స్తాయి లో తెలియ జేస్తూ అవగాహన కల్పించాలన్నారు. ఆయిల్ పామ్ సాగుతో పాటు అంతర పంటలను సాగుచేయవచ్చన్నారు.

Related posts

దళిత బహుజనులు పక్షపాతి డాక్టర్ మిరియాల చంద్రయ్య

Satyam NEWS

స్వాత్రంత్య వేడుకలను 20 నిమిషాల్లో పూర్తి చేయాలి

Satyam NEWS

ఏపీ లో చో్రీ.. తెలంగాణ లో సేల్

Bhavani

Leave a Comment