శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల కు చెందిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మిరియాల చంద్రయ్య ఆకస్మిక మృతి కి దళిత బహుజన ప్రజాసంఘాలు సంతాపం ప్రకటించాయి. నేడు ఇలిసిపురం విజ్ఞాన మందిరంలో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో పలువురు నివాళులర్పించారు.
దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సన్నశెట్టి రాజశేఖర్, అరుణోదయ రాష్ట్ర నాయకులు, కూలనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, సామాజిక న్యాయ, పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేష్, ప్రగతిశీల మహిళ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ కృష్ణవేణి, సీపీఐ యం యల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, ఇఫ్ట్ జిల్లా కార్యదర్శి యన్ నీలం రాజు, బొగ్గు భాస్కరరావు,కానుకుర్తి సూర్యారావు మాదిగ దండోర నాయకులు, కె.వి పీ ఎస్ జిల్లా నాయకులు ,అంబేద్కర్ విజ్ఞాన మందిరం అధ్యక్ష కార్యదర్శులు రాయి వేణు,బడే కమరాజు, బాలక్రిష్ణ, తదితరులు నివాళులర్పించారు.