28.2 C
Hyderabad
May 9, 2024 01: 19 AM
Slider ఖమ్మం

పేదవారికి కూడా ఉత్తమమైన విద్య

#Puvvada Ajay Kumar

ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ప్రతి సామాన్యుడికి నాణ్యమైన, ఉన్నత విలువలు, ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7,289 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం మన ఊరు- మన బడి / మన బస్తీ-మన బడిని చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను పూర్తి చేసిన పాఠశాలలను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని మామిళ్ళగూడెం ప్రాథమిక పాఠశాలను రూ.12.49 లక్షలు, శాంతి నగర్ ఉన్నత పాఠశాలను రూ. 1.14 కోట్లతో పూర్తి చేసి, పాఠశాలలను మంత్రి పునఃప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలకు ఉచిత, నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థికి అందించనున్నదని ఆయన తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి చేసి అన్ని మౌళిక వసతుల కల్పన చేస్తున్నట్లు ఆయన అన్నారు. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 9,123 సర్కార్ బడులలో రూ.7,289 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. నాణ్యమైన బోధన, నాణ్యమైన భోజనం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని, ప్రయివేటు స్కూల్ బంద్ అయి పిల్లలు అందరూ సర్కార్ స్కూళ్లకు వచ్చే విధంగా సకల వసతులు కల్పిస్తున్నామని మంత్రి అన్నారు.

జిల్లాలో మొదటి విడతగా 426 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి, 12 రకాల ప్రధాన అంశాలతో వసతులు కల్పించడం జరిగిందని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని పాఠశాలలో వసతులు కల్పించి ప్రతి సామాన్యుడికి విద్యను అందిస్తామని పేర్కొన్నారు. పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించామని, ఒకవైపు బోధన, మరోవైపు వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు.

పిల్లలు పుస్తక పఠనంతో పాటు నేర్చుకునేందుకు డిజిటల్ తరగతులు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్ పిల్లలకు శానిటేషన్ కిట్స్ ఇవ్వబోతుందని, వారం పది రోజుల్లో ప్రభుత్వం ఇది ప్రారంభించనుందని అన్నారు. మన ఊరు-మన బడి వల్ల ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరుగుతాయయని, ఇక నుండి మరింత బలోపేతం అవుతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

రెసిడెన్షియల్ స్కూళ్లలో ఒక విద్యార్థి పైన తెలంగాణ ప్రభుత్వం 1.25 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుందని, విదేశీ విద్యా కోసం వెళ్లే విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. స్కూళ్లలో సిబ్బంది సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడల పైన దృష్టి పెట్టాలని, వచ్చే విద్యా సంవత్సరంలో సర్కారు బడులలో ప్రవేశాల సంఖ్య మరింత పెరిగే విధంగా సిబ్బంది నాణ్యమైన విద్యాబోధనను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి క్రింద జిల్లాలో మొదటి విడతగా 426 పాఠశాలల్లో పనులు చేపట్టినట్లు, 60 పాఠశాలలు పూర్తి స్థాయిలో పనులు చేసుకొని, పునఃప్రారంభం చేసుకుంటున్నట్లు తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి విద్యా శాఖ రూ. 120 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన అన్నారు.

పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం పెట్టుబడిగా పనులు చేపట్టిందని, విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. మంచి ప్రాంగణంలో ఉల్లాసంగా, ఇష్టంగా చదవాలని, ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ అన్నారు.

Related posts

ఛారిటీ: నిరుపేద కుటుంబాలకు పెళ్లి కానుక

Satyam NEWS

సంక్రాంతి పండుగ

Satyam NEWS

అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషకాహార వారోత్సవాలు

Satyam NEWS

Leave a Comment