36.2 C
Hyderabad
May 15, 2024 16: 07 PM
Slider నల్గొండ

ఓజో ఫౌండేషన్ ద్వారా గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో క్రొత్తగా డ్రైనేజ్ ఏర్పాటు

#drianage

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల కేంద్రంలో 1986 లో ఏర్పాటు చేసిన గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో క్రొత్తగా డ్రైనేజీ ఏర్పాటుచేసి మరోమారు మానవత్వం చాటుకున్న ఓజో పౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు.

మండల కేంద్రంలోనే కాకుండా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలలో మౌళిక వసతులు ఏర్పాటు చేసి,పాఠశాల భవనాలకు రంగులు ఏర్పాటు చేసిన విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ ఎంతోమంది విద్యార్థులను ప్రోత్సహిస్తూ గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు కి విద్యార్థుల పక్షాన గురుకుల ప్రిన్సిపల్ వాణి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

నియోజకవర్గ ఇంచార్జ్ వెంకన్న మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఒక ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని సృష్టించి అనేక సేవా కార్యక్రమాలు చేయాలనే తపన ఉన్నటువంటి వ్యక్తి  ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు అని అన్నారు.మంచి పనులు చేస్తున్న వారిని ప్రేమించి ఆదరించాలని, ఆదరిస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఓజో పౌండేషన్ హుజూర్ నగర్ ఇంచార్జ్ కుక్కల వెంకన్న,రామాంజి గౌడ్,వెంకటేష్, నక్కాని నరేష్,నాగ నాయక్,రవి నాయక్  రాజు కుమార్,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

నవతరానికి స్ఫూర్తిదాత భగత్ సింగ్

Sub Editor 2

వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేసి రైతులను ఆదుకోవాలి

Satyam NEWS

“చల్లని” వాతావరణం లో పోలీసు“స్పందన”…!

Bhavani

Leave a Comment