Slider హైదరాబాద్

వృద్ధుల సంక్షేమ సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి

#MLA Beti Subhashreddy

వయోవృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం గత జిహెచ్ఎంసి కౌన్సిల్ లో మంజూరైన రూ. 17.50 లక్షల నిధులతో నిర్మించిన కమల నగర్ వయోవృద్ధుల సంక్షేమ సంఘం భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ… జీవితంలో ఎంతో అపారమైన అనుభవం ఉన్న వయోవృద్ధులు సమాజానికి ప్రయోజనం చేకూరేలా సేవ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇక  కాలక్షేపానికి వయో వృద్ధుల సంక్షేమ భవనాలు దోహదపడతాయి అన్నారు.

అలాగే కమల నగర్ వయోవృద్ధుల సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి విరాళాలు అందజేసిన వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో లో కార్పొరేటర్ శిరీష రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పావని రెడ్డి, కొత్త రామారావు, కమల నగర్ వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బి ఎల్లారెడ్డి, సంయుక్త కార్యదర్శి విటలా చారి, కోశాధికారి టీ  పార్థసారథి, సభ్యులు బాల్ రెడ్డి,  బి సంగయ్య, నేతలు రాఘవరెడ్డి, కాసం మైహిపాల్ రెడ్డి , మణిపాల్ రెడ్డి, బేతాళ బాల్రాజ్ , పులి చేరాలు ముదిరాజ్ , కొత్త అంజిరెడ్డి, సోమశేఖర్ రెడ్డి, కమల నగర్ కాలనీ సంక్షేమ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు

Related posts

కామారెడ్డి అర్ధరాత్రి వరకు కార్యదర్శుల ఆందోళన

Satyam NEWS

బస్, విద్యుత్ చార్జీల పెంపు ఆలోచన విరమించుకోవాలని సిఐటియు డిమాండ్

Satyam NEWS

6వ రోజు ఆర్టీసీ కార్మికుల మోకాళ్ళ పై బిక్షాటన

Satyam NEWS

Leave a Comment