26.7 C
Hyderabad
April 27, 2024 09: 43 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ పశు సంరక్షణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం

#mla saidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ప్రాంతీయ పశు సంరక్షణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది.

పశు వైద్యశాలకు నూతన ఆపరేషన్ థియేటర్ ఆధునీకరణకు శాసనసభ్యుడు  శానంపూడి సైదిరెడ్డి తనకు కేటాయించిన నిధుల నుండి పది లక్షల రూపాయలు మంజూరు చేయిస్తానని అధికారులకు హామీ ఇచ్చారు.

ఆధునీకరణకు అయ్యే ఖర్చును అంచనా వేసి పంపించాలని అధికారులను ఆదేశించారు.డి ఎం ఎఫ్ టి నిధుల నుండి పశు వైద్యశాల కొత్త భవనాల మరమ్మత్తుల గాను గతంలో మంజూరు అయిన నిధులు వినియోగించుకోవాని సైదిరెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్య, పశు సంవర్ధక అధికారి డా.శ్రీనివాస్,హుజుర్ నగర్ ఏవో డా.రూప కుమార్,మండల వైద్యాధికారి డా.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

రిటర్నింగ్ అధికారిగా మైనారిటీ తీరని బాలుడు

Satyam NEWS

డోనాల్డ్ ట్రంప్ ప్రకటన: ‘‘నేను గెలిచాను’’

Satyam NEWS

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై అమలాపురంలో నిరసన

Satyam NEWS

Leave a Comment