స్నేహితుని భార్య ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలుసుకున్న స్నేహితులు తమ వంతుగా సహాయాన్ని అందజేశారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన కాశ పండరి భార్య జయసుధకు దురదృష్ట వశాత్తు మెదడులో రక్తనాళము ఉబ్బడం వల్ల తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నది. ఇది పగిలితే ప్రాణాపాయం ఉందని కిమ్స్ హాస్పిటల్ న్యూరో డిపార్ట్మెంట్ సికింద్రాబాద్ వారు తెలిపారు.
ఆపరేషన్ ఖర్చులు 10 లక్షల అవుతుందని చెప్పడంతో దాతల సహాయం కోసం అర్థించారు. దాంతో 1995-96 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తలా కొంత జమచేయగా 34 వేలు జమయ్యాయి. ఆ నగదుకు సంబందించిన చెక్కును తోటి స్నేహితునికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాతలు ఎవరైనా తమవంతు సహకారం అందించాలని కోరారు.