26.7 C
Hyderabad
May 3, 2024 10: 41 AM
Slider ముఖ్యంశాలు

ప్రియుడి మోజులో పిల్లల్ని, తల్లిని వదిలించుకున్న మహిళ

#mother

వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఆగం చేస్తున్నాయి. కట్టుకున్న భర్తను, కన్న తల్లిదండ్రులు, రక్తం పంచుకు పుట్టిన పిల్లలను వదిలేసి తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇలాంటి దారుణ ఘటనే కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడ్డ ఓ మహిళ భర్తను వదిలేయడంతో పాటు తన ముగ్గురు పిల్లల్నీ వృద్ధ తల్లి వద్ద వదిలేసి వెళ్లిపోయిన ఘటన పట్టణంలో కలకలం రేపింది.

కామారెడ్డి పట్టణంలోని గోపాలస్వామి వీధిలో సుజాత అనే మహిళ తన వృద్ధ తల్లి, ముగ్గురు పిల్లలతో అద్దెకుంటోంది. నాందేడ్ కు చెందిన తన భర్తను వదిలేసి వచ్చి కామారెడ్డిలో ఉంటున్న సుజాతకు గత కొద్దిరోజులుగా మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నదాన్ని బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లితో పాటు ముగ్గురు పిల్లల్నీ వదిలేసి ప్రియునితో వెళ్లిపోయింది సుజాత. దీంతో ఆలనాపాలనా కరువైన వృద్ధురాలితో పాటు ముగ్గురు పిల్లలకు గోపాలస్వామి వీధికి చెందిన స్థానికులే అన్నం పెడుతున్నారు.

అయితే, మంగళవారం మళ్ళీ ఇంటికి వచ్చిన సుజాత పెద్దమ్మాయిని తీసుకుని వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న వృద్ధురాలు స్థానికుల సహకారంతో డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు వృద్ధురాలినీ, ఇద్దరు పిల్లల్నీ పోలీస్ స్టేషన్లో ఉంచి పెద్దమ్మాయిని తీసుకుని కనిపించకుండా పోయిన సుజాత కోసం ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఓ మూడేళ్ళ బాలుడు, ఐదేళ్ల బాలుణ్ని పెట్టుకుని పోలీస్ స్టేషన్ లో కూర్చున్న ఆ వృద్ధురాలిని చూసిన వారు కంట తడి పెడుతున్నారు. అడుగంటిపోతున్న మానవ సంబంధాలకు పరాకాష్ఠగా ఈ ఘటన అందరిని చర్చించుకునేలా చేసింది

Related posts

కాంగ్రెస్ సభకు పోలీసుల అనుమతి

Bhavani

సహాయ కార్యక్రమాల్లో జాప్యం వద్దు: సిఎం జగన్

Satyam NEWS

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఆకస్మిక మరణం

Satyam NEWS

Leave a Comment