27.7 C
Hyderabad
April 26, 2024 06: 41 AM
Slider ఖమ్మం

మంత్రి కేటీఆర్ ను కలిసిన మంత్రి పువ్వాడ అజయ్

#Minister KTR

మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో భాగంగా దావోస్ పర్యటన లో తెలంగాణ రాష్ట్రానికి 21000 కోట్ల పెట్టుబడులు వచ్చిన సందర్భంగా వారిని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ బి.ఆర్.కె భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో భారీ జన సమీకరణతో బిఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ ఖమ్మంలో విజయవంతమైన సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి

కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మంత్రి అజయ్ కుమార్ అన్న కుమారుడు పువ్వాడ నరేన్ వివాహ రిసెప్షన్ ఫిబ్రవరి 10వ తేదీన ఖమ్మంలో జరగనున్న నేపథ్యంలో వారికి ఆహ్వాన పత్రికను అందజేసి సాదరంగా ఆహ్వానించారు.

Related posts

అధిక ధరలకు అమ్మితే కేసు గ్యారెంటీ

Satyam NEWS

రాజ‌ధాని రైతులకు సంఘీభావంగా కదం తొక్కిన తెలుగు త‌మ్ముళ్లు

Satyam NEWS

రైతు పురోభివృద్ధికి తెలంగాణ మార్గదర్శకత్వం

Satyam NEWS

Leave a Comment