పంచాయతీ ఎన్నికల ఓటింగ్ లో గిరిజనులు వ్యయప్రయాసలకు ఓర్చి కాలినడకన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు.
విజయనగరం జిల్లా సాలురు మండలం ఒడిషా సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఈ పంచాయతీ లో దిగువ రూడ, కాగరూడ, గాడివలస, కొంక మామిడి, గాలిపాడు గిరి శిఖర గ్రామాల నుంచి కొండలు, గుట్టలు, వాగులు దాటుకుంటూ కాలి నడక సుమారు 8 కిలో మీటర్ల దూరంను 2.30 గంటల పాటు ప్రయాణించి దళాయి వలసలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ పోలింగ్ బూత్ లో మధ్యాహ్నం ఒంటి గంటన్నరకి 485 ఓట్లకు గాను 61 శాతంతో 297 పోలయ్యాయి. సంపంగి పాడు గ్రామం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది.
తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గిరి శిఖర గ్రామాల నుంచి ఓటర్లు కాలి నడకన గిరిజన ఓటర్లు కిందికి దిగి వచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడంలో ఆదర్శంగా నిలిచారు.