నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ పరిధిలోని పీజీ కళాశాల సమీపంలో రెండు బైకులు ఢీకొనడంతో పట్టణానికి చెందిన ఒకరు మరణించారు. ఈ సంఘటనలో పలువురు తీవ్రంగా గాయపడి కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు.
ఈ రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని 16 వ వార్డుకు చెందిన కరెంట్ ఇస్మాయిల్ కుమారుడు పాషా అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయలపాలై కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా వారిని పరామర్శించిన జూపల్లి సంబంధిత వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతి చెందిన పాషా కుటుంబానికి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు. వారితోపాటు పట్టణ కౌన్సిలర్ లు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.