37.2 C
Hyderabad
May 6, 2024 12: 34 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో రోడ్డు ప్రమాదం: క్షతగాత్రుతలను పరామర్శించిన మాజీ మంత్రి జూపల్లి

#jupally

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ పరిధిలోని పీజీ కళాశాల సమీపంలో రెండు బైకులు ఢీకొనడంతో పట్టణానికి చెందిన ఒకరు మరణించారు. ఈ సంఘటనలో పలువురు తీవ్రంగా గాయపడి కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు.

ఈ రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని 16 వ వార్డుకు చెందిన కరెంట్ ఇస్మాయిల్ కుమారుడు పాషా అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయలపాలై కొల్లాపూర్  ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా వారిని పరామర్శించిన జూపల్లి సంబంధిత వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతి చెందిన పాషా కుటుంబానికి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు.  వారితోపాటు పట్టణ కౌన్సిలర్ లు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.

Related posts

రెండు లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం

Sub Editor

ఇంజుర్డ్:రైలుఫుట్ బోర్డులో ఇరుక్కున్న ప్రయాణికుడు

Satyam NEWS

అంబర్పేట్ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు

Satyam NEWS

Leave a Comment