36.2 C
Hyderabad
May 7, 2024 14: 19 PM
Slider రంగారెడ్డి

ఏసిబి వలలో పరిగి ఎస్సై క్రాంతి కుమార్

#pargisi

పరిగి ఎస్సై క్రాంతి కుమార్ రూ.10వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా గురువారం సాయంత్రం పట్టుకున్నారు. ఏసిబి డిఎస్పీ సూర్య నారాయణ తెలిపిన వివరాల ప్రకారం సయ్యద్ పల్లి గ్రామానికి చెందిన మాసని సురేష్, భూమన గారి సాయి రెడ్డి మద్య గత నెలలో మల్లికార్జున గుడి విషయంలొ వాట్సప్ గ్రూపుల్లో  జరిగిన వివాదం విషయమై పరిగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తర్వాత ఆ కేసుకు సంబంధించి ఫిర్యాదు దారులు ఇరువురు కాంప్రమైజ్ అయ్యారు. కాగా ఆ కేసు విషయంలో సాయి రెడ్డి చిన్నాన్న అయిన పరశు రామ్ రెడ్డిని ఎస్సై రూ.10 వేలు  లంచం డిమాండ్ చేశారు. దీంతో పరశురామ్ రెడ్డి ఏసిబి అధికారులను ఆశ్రయించాడు.  గురువారం సాయంత్రం పరిగి పట్టణంలోని స్వాగత్ హోటల్ దగ్గర  ఎస్సై క్రాంతి కుమార్ కు  రూ.10వేలు పరశు రామ్ రెడ్డి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసిబి డిఎస్పీ సూర్య నారాయణ తెలిపారు.

Related posts

చలి కాలం వ్యాధులకు సంజీవిని హోమియోపతి వైద్యం

Bhavani

కార్యనిర్వాహక రాజధాని దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు

Satyam NEWS

హుజూర్ నగర్ వాసి తండు హరికృష్ణ గౌడ్ కు డాక్టరేట్ పురస్కారం

Satyam NEWS

Leave a Comment