కడప జిల్లా ఒంటిమిట్ట మండలం లో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ధర్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి ఒంటిమిట్ట మండల పరిధిలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఇసుక రాళ్ల బోర్డు వద్ద చోటు చేసుకుంది.
తిరుపతిలో టెలిఫోన్ జే ఈ గా పనిచేసే ధర్మయ్య కొద్ది రోజుల క్రితం స్వగ్రామమైన చింత రాజు పల్లి గాండ్ల పల్లెకు వచ్చినట్లు తెలిసింది. మోటార్ బైక్ పై ఒంటిమిట్టకు వెళ్లి తిరిగి వస్తుండగా లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.