కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి లో బిజెపి రాజంపేట శాఖ తరపున రాజంపేట బిజెపి అసెంబ్లీ కన్వీనర్ పొతుగుంట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో సోమవారం వైద్య సిబ్బందికి పిపిఈ కిట్లు పంపిణీ చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్య కుమార్ సౌజన్యంతో పిపిఈ (PPE) కిట్లు, మాస్కులు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ వెంగల్ రెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ అనిల్ కు అందచేశారు.
ఈ సందర్భంగా బిజెపి అసెంబ్లీ కన్వీనర్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ కరొణ వల్ల ప్రభుత్వ డాక్టర్లు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేస్తున్న కారణంగా వారికి భారతీయ జనతా పార్టీ తరపున పిపి ఈ కిట్లు అందచేశామన్నారు. వారు విధి నిర్వహణలో ఈ కిట్లు వినియోగించుకోని వారు తమ ప్రాణాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రజల ప్రాణాలు ను రక్షించాలని కోరారు. వైద్యులు చేస్తున్న సేవలకు బిజెపి ఉడతా భక్తిగా ఈ పిపి ఈ కిట్లు ఇస్తున్నదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వై సురేష్ రాజు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పట్టుపోగుల ఆదినారాయణ బిజెపి మండల అధ్యక్షురాలు డి. ప్రభావతి బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి. హరిప్రసాద్ బిజెపి జిల్లా నాయకులు పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.