పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని పి.టి.జి బాయ్స్ జూనియర్ కాలేజ్, జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల కాగజ్ నగర్ ను జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ గురించి సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. పరీక్ష నిర్వహణ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది కి మొబైల్ ఫోన్స్ లోనికి అనుమతి లేదని ఎస్పీ తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున , ఏ సమస్య ఉన్న వెంటనే పోలీస్ అధికారులకు తెలియజేయాలని పరీక్ష నిర్వహణ సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర రావు, ఆసిఫాబాద్ డి.ఎస్.పి శ్రీనివాస్, కాగజ్ నగర్ డిఎస్పీ కరుణాకర్, ఆసిఫాబాద్ సిఐ రాణా ప్రతాప్ పాల్గొన్నారు.