భారత వాతావరణ శాఖ పేర్కొన్నట్లు గానే ఏపీ ని కారుమబ్బులు కమ్మేసాయి. ఫలితంగా రాష్ట్రం అంతటా అక్కడక్కడ వర్షం పడింది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర లో అదీ విజయనగరం లో గంట సేపు వర్షం దంచి కొట్టింది. దీంతో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో సాయంత్రం 04.30 నుంచీ 05.30 వరకు తెగ వర్షం పడటంతో ఆ గంట పాటు పూర్తిగా బస్సుల రాకపోకలు స్తంభించాయి. ఇక ఆగంట పాటు వర్షానికి ఆర్టీసీ కాంప్లెక్స్ తడిసి ముద్దయ్యింది.
previous post