రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్ కే రోజా రోజా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరగనున్న ఉచిత కంటి పరీక్ష శిబిరంను ఆదివారం సాయంత్రం సందర్శించి ఏర్పాట్లును పరిశీలించారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ మూడో తేదీ సోమవారం నుంచి పదో తేదీ సోమవారం వరకు నగరిలోని మంత్రి కార్యాలయంలో శంకర నేత్రాలయ కంటి వైద్యశాల, చెన్నై వారి ఆధ్వర్యంలో జరిగే ఉచిత కంటి చికిత్స శిబిరం లో ఆపరేషన్ నిర్వహించి రోగులకు కంటి అద్దాలు, మందులు మాత్రలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కంటికి సంబంధించిన అన్ని రకాల జబ్బులకు చికిత్స చేసి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుంది.