మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది.
మహబూబాబాద్ జిల్లా భూపతి పేట గ్రామానికి చెందిన కుందారపు విక్కీ అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
నిన్న అర్ధ రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పదునైన కత్తులతో దాడి చేశారు.
దాంతో నుదిటిపై, తల వెనుక భాగం పై బలమైన గాయాలు తగలడంతో అతను మరణించాడని పోలీసులు తెలిపారు.
హత్యకు గల కారణాలు తెలియలేదు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.