భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆశీస్సులతో* శ్రీ సత్య సాయి సేవా సంస్థలు , కోఠి సమితి ఆధ్వర్యాన మంగళవారం ఉదయం 10.45 ని.లకు స్థానిక లిబర్టీ ఆప్టికల్స్ ప్రాంగణంలో ‘ శ్రీ సత్యసాయి ఉచిత హోమియో క్లినిక్ ‘ పునః ప్రారంభ వేడుక నిరాడంబరంగా జరిగింది.
శ్రీ సత్య సాయి కోఠి సమితి కన్వీనర్ పి.వి. శాస్త్రి స్వాగతోన్యాసం చేశారు. సీనియర్ హోమియోపతిక్ వైద్యుడు డా. జి. దుర్గాప్రసాద్ రావు ప్రసంగిస్తూ ‘ అందరికీ ఆరోగ్యం ‘ పరిపూర్ణంగా దక్కాలంటే మనం చేస్తున్న చికిత్స లో ‘ ప్రేమ – కరుణ ‘ నిండుగా ఉన్నపుడే అది సార్థకం అవుతుందని తెలుపు తూ , అదే విధంగా వైద్య సేవా దృక్పదం పంచ సూత్ర పథకం లా అభివర్ణించారు.
నాణ్యత , ఉచిత సేవ , విలువలతో కూడిన పని , కుల మత రహిత , సంపూర్ణ* వైద్యం అందిచడమే శ్రీ సత్య సాయి ఉచిత హోమియో క్లినిక్ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. హోమియో క్లినిక్ కన్సల్టెంట్ డా. సింధు భైరవి మాట్లాడుతూ , తన ఆశయాలకు అనుగుణంగా కోఠి సమితి తరఫున శ్రీ సత్య సాయి ఉచిత హోమియో క్లినిక్ లో సేవలు అందించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని , భవిష్యత్తు లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తానని తెలిపారు.
స్థల యజమాని, లిబర్టీ ఆప్టిషి యన్స్ అధినేత డా. ఆదిత్య మాట్లాడుతూ, తమ ప్రాంగణంలో ఉచిత హోమియో వైద్య సేవలు కొనసాగించటం వల్ల బాబా గారి ఆశీస్సులను పొందడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.ఇకనుండి ఈ సెంటర్ లో ప్రతి బుధవారం ఉదయం 10.30 గం. నుండి 12.30 గం.
వరకు* డా. సింధు భైరవి ఉచితంగా హోమియో వైద్య సేవలు అందిస్తారని , ఈ అవకాశం అందరూ వినియోగించు కావాలని కన్వీనర్ శాస్త్రి ముగింపు వాఖ్యలు పలుకగా , డా. సింధు భైరవి రోగులను పరీక్షించి మందులు అందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి కోఠి సమితి సేవాదళ్ – శ్రీమతి శైలేశ్వరి , ఇతర సభ్యులు మరియు అతిధులుగా సీనియర్ హోమియో వైద్యులు , డా. మానిక్ ప్రభు , డా. తేజస్వి శరణ్ తదితరులు పాల్గొన్నారు.