కనిపెంచిన బిడ్డలు ఉన్నా ఈ తిరిపయ్య అనాథగానే మిగిలిపోయాడు. తండ్రి పోషణ భారంగా భావించిన అతడి బిడ్డలు వదిలేశారు. ఎండకు, వాన కు తట్టుకొని ఇక లాభం లేదనుకున్న ఆ తనువు రాలిపోయింది. కడప జిల్లా రాజంపేట కొత్త బస్ స్టాండ్ వద్ద గడోరి పల్లె కి చెందిన తిరిపయ్య (60) అనే వృద్ధుడు ఆకస్మికంగా మృతి చెందాడు.
ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే ఆదరించే వారు లేక కూలి పని చేసుకొని జీవించేవాడని సమాచారం. తిరిపయ్య కుమారుడు బస్ స్టాండ్ సమీపంలో మన్నూరు లో నివాసం ఉన్నప్పటికీ తిరిపయ్య యోగ క్షేమాలు పట్టించుకోలేదు.
వయోభారంతో కూలి పని చేసేందుకు శరీరం సహకరించక పోవడంతో యాచక వృత్తి చేసుకుంటూ సమీపంలో ని గుళ్ల వద్ద నిదురించే వాడని తెలిసింది. కాగా సాయంత్రం బస్ స్టాండ్ చెట్టు వద్ద కుప్పకూలి పోవడంతో కొందరు గుర్తు పట్టినా పట్టించుకోలేదు. మరికొందరు గుర్తు పట్టి పోలీసులకు, బంధువులకు సమాచారం చేరవేశారు.