నాచారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోన్ని ఎఫ్ సిఐ గోడౌన్ తదితర ప్రాంతాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న దుకాణ దారులపై మల్కాజ్ గిరి ఎస్ఓటి పోలీసులు ఉక్కు పాదం మోపారు. వినాయక చవితి శోభాయాత్ర సందర్భంగా గురువారం ఉదయం 6 గంటల నుండి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలపై నిషేధం విధించారు. కొందరు దీన్ని ఆసరాగా తీసుకొని భారీ ఎత్తున మద్యం కొనుగోలు చేసి అడ్డదారులు విక్రయిస్తున్న వారిపై మల్కాజ్గిరి పోలీసులు కేసులు నమోదు చేసి నాచారం పోలీసులకు నిందితులను అప్పగించారు. ఈ బెల్టు షాపులు కేవలం పండుగ వేళలోనే కాకుండా అనునిత్యం కొందరి అండదండలతో నిర్వర్తిస్తున్నారని స్థానిక ప్రజలు అంటున్నారు. అక్రమంగా బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
previous post