ఆల్ ఇండియా యునైటెడ్ పద్మశాలి సంఘం నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆయన నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. ఆల్ ఇండియా యునైటెడ్ పద్మశాలి సంఘం కన్వీనర్ మ్యాడమ్ బాబురావు అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో కంది శ్రీ రాములు, వనం రమేష్, ఎలిగేటి గోపి, బొమ్మ రఘురాం, నర్సింగ్ రావు, శంకర్, పగిడి మర్రి హరి, కౌకుంట్ల రవి తేజ, కొత్త జగన్, శ్రీపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట