ప్రపంచ దేశాలు కరోనాతో పోరాడుతుంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం పాకిస్తాన్ పై పోరాడుతున్నారని పంజాబ్ (పాకిస్తాన్) ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దార్ వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్ భూభాగం పైకి వచ్చి కాల్పులకు పాల్పడుతున్న భారత్ తమ దేశంలోని పౌరులను చంపుతున్నదని ఆయన అన్నారు.
భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని ఉస్మాన్ బుజ్దార్ అన్నారు. ఉపఖండంలో శాంతిని భగ్నం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్రమోడీ పని చేస్తున్నారని ఆయన అన్నారు.
కాశ్మీర్ లోని తమ సోదరుల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడబోమని ఆయన అన్నారు.