విశాఖ ఏర్ పోర్ట్ లో ఘన స్వాగతం…!
టీడీపీ అధినేత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కు విశాఖ ఏర్ పోర్ట్ లో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచీ భారీ కాన్వాయ్ తో రాజాం బయలుదేరారు. విజయనగరం జిల్లాలో నాతవలస జంక్షన్ వద్ద కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, అశోక్ గజపతిరాజు, ఆదితీగజపతిరాజు, పతివాడ నారాయణ స్వామి, తదితరులు అంతా చంద్రబాబు రాజాం పర్యటన కు సిధ్ధం గా ఉన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా.. జిల్లా ఎస్పీ ఆదేశాలతో భోగాపురం సీఐ విజయానంద్ ,డెంకాడ ఎస్ఐ మహేష్ లు బందోబస్తు తో సిధ్దంగా ఉన్నారు. ఈ సాయంత్రం చంద్రబాబు నాయుడు నాతవలస, చిలకపాలెం మీదుగా రాజాం లో కొండ్రు మురళీ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
నాతవలస కు చేరుకున్న టీడీపీ అధినేత…గజమాలతో స్వాగతం…!
టీడీపీ అధినేత చంద్రబాబు కు విజయనగరం జిల్లా నాతవలస లో టీడీపీ శ్రేణులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. సరిగ్గా మధ్యాహ్నం 03.30 నాతవలస టోల్ గేట్ వద్దకు బాబు తన భారీ కాన్వాయ్ తో వచ్చారు.
పైడిభీమవరం ,రణస్థలం వద్ద బాబు కు ఘన స్వాగతం..!
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కు విజయనగరం జిల్లాలో స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు.. సిక్కోలు జిల్లా లి కూడా ఘన స్వాగతం పలికారు. సాయంత్రం 04.00 శ్రీకాకుళం జిల్లా రణస్థలం కు బాబు కాన్వాయ్ చేరుకుంది. బాణా సంచాతో బాబు స్వాగతం పలికారు.. సిక్కోలు ప్రజలు. పైడిభీమవరం నుంచీ భారీ కాన్వాయ్ తో బాబు… రణస్థలం కు చేరుకున్నారు. దారిపొడవునా…పార్టీ శ్రేణులు కాబోయే సీఎం బాబు’అంటూ నినాదాలు చేసారు. సరిగ్గా రణస్థలం వద్ద 04.12 కు బాబు కాన్వాయ్… భారీ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది.