37.2 C
Hyderabad
May 6, 2024 20: 55 PM
Slider మహబూబ్ నగర్

పాలమూరు వలస కూలీలను వాపసు తెప్పించండి

#TDP Mahaboobnagar

మహబూబ్ నగర్ జిల్లా నుండి మహారాష్ట్ర, కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిన లక్షలాది కూలీలను వెంటనే స్వస్థలాలకు రప్పించాలని తెలుగు దేశం పార్టీ డిమాండ్ చేసింది. మహబూబ్ నగర్ జిల్లా  తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అధ్యక్షుడు నారాయణస్వామి, ప్రధాన కార్యదర్శి ఆర్.బాలప్ప మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పని చేస్తున్న కార్మికులకు ప్రభత్వం గ్రామ పంచాయతీ నిధులనుండి మాస్కులూ సానిటైజర్లు ఇవ్వాలని సూచించింది.

అలా కాకుండా ప్రభుత్వం వెంటనే DRDA ద్వారా మాస్కులు సానీటైజర్లు పంపిణీ చేయాలని కోరుతున్నామని అన్నారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండల కేంద్రం లో  రెైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని గన్ని బ్యాగులు, లారీలు లేవు అని వడ్లను కుప్పలు తెప్పలుగా పోశారని, వర్షం వస్తే ధాన్యం తడిసిపోయి అవకాశం ఉన్నందున ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని ఈ సమస్య ను పరిష్కరించాలని వారు కోరారు. NBK Trust తరపున తోపుడు బండ్ల వ్యాపారులకు మాస్కూలు ఉచితంగా అందచేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్  తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారాయణస్వామి ప్రధాన కార్యదర్శి ఆర్.బాలప్ప NBK Trust అధ్యక్షులు కుమార్, చెన్నయ్య, ఎండీ. అలీం, ఎండీ.జాని, షబ్బీర్ బాబా, ఎండీ గౌసే పాల్గొన్నారు.

Related posts

రివర్స్ గేర్ :కెటిఆర్ కారు ను అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్

Satyam NEWS

కందకు లేని దురద ఈ కత్తిపీటకు ఎందుకు?

Satyam NEWS

ఏపీఎస్ఆర్టీసీ లో తగ్గిన సరుకుల రవాణా చార్జీలు

Satyam NEWS

Leave a Comment