శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల పల్లకి సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. త్రిలోక సంచారానికి గుర్తుగా శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాకారం చుట్టూ వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పల్లకి సేవ జరిగింది.
పల్లకి సేవ సందర్భంగా భక్తుల జయ జయ భవాని నామస్మరణతో దేవాలయ ప్రాంగణం మారుమోగింది. పల్లకి సేవలో భాగంగా మూడు సార్లు ప్రదక్షిణలు చేశారు. పల్లకి సేవ కార్యక్రమాన్ని ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్ రమేష్ బాబు పర్యవేక్షించారు.