Slider మెదక్

ప్రగతి కార్యక్రమాలతో వెలుగుతున్న పల్లెలు

#minister harishrao

ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి తో పల్లెలు పట్టణాలు రూపురేఖలు మారుతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.

మంగళవారం నాడు జిల్లాలోని సదాశివపేట, కోహిర్, జహీరాబాద్, మొగుడం పల్లి గ్రామాలలో అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. సదాశివపేట పట్టణంలోని ఉబ చెరువు సుందరీకరణ ( మినీ ట్యాంక్ బండ్ ను )మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సదాశివపేట పట్టణంలో సుమారు 20 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించుకుంటున్నామని తెలిపారు.

రూపాయలు 5.50 కోట్లతో ఉబ చెరువు. సుందరీకరణ పనులు చేపట్టామని,రూ.5 కోట్లతో సెంట్రల్ లైటింగ్ సిస్టం, 35 లక్షలతో లైబ్రరీ భవనం నిర్మాణం,రూ. 7.75 కోట్ల ఖర్చుతో వైకుంఠధామం,  ముస్లిం, క్రిస్టియన్ స్మశాన వాటిక లను నిర్మించుకున్నామని తెలిపారు. ఒక్కో స్మశాన వాటికకు ఐదు ఎకరాల చొప్పున భూమిని కొనుగోలు చేసి ఇచ్చామని తెలిపారు.

బతుకమ్మ ఘాట్ బాగుందని కితాబు నిచ్చారు.  చెరువు పై ఆ చివర నుండి ఈ చివరి వరకు లైటింగ్ కోసం, పిల్లల ఆట వస్తువులు మరిన్ని ఏర్పాటు చేయడానికి, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు, గ్రానైట్ తో కూర్చోవడానికి బల్లల కోసం కోటి రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ కు సూచించారు.

ప్రభుత్వం రూ. 500 కోట్లతో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ సమీకృత మార్కెట్ల ను నిర్మిస్తుందని అన్నారు. మార్కెట్లో సకల సౌకర్యాలు ఉండేలా కడుతున్నామన్నారు. సదాశివ పేట పట్టణంలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ యార్డులో సమీకృత మోడల్ మార్కెట్ నకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఇట్టి మార్కెట్ ను తొమ్మిది నెలల లోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.

ముస్లింల అంతిమయాత్రకు అవసరమైన  ఆఖరి సఫర్ కా గాడి కొరకు, అదేవిధంగా క్రిస్టియన్లకు  పరలోక యాత్ర వాహనం నకు 15 లక్షల చొప్పున మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా హిందువుల వైకుంఠధామం లో పూర్తి స్థాయి సదుపాయాల కల్పనకు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

రూ.45 కోట్లతోసదాశివ పేట పట్టణంలో  ఇంటింటికి తాగునీరు అందించేలా మంచినీటి పథకం ప్రారంభించామని, దీపావళి లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరు అందిస్తామన్నారు.

పట్టణంలో కొత్త సిసి రోడ్లు వేయడానికి మురుగు కాలువల కు మరో 20 కోట్ల రూపాయలు మంజూరు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఈనెల 15వ తేదీలోగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. వచ్చే నెల నుండి 57 సంవత్సరాలు ఉన్న అర్హులకు ఆసరా పెన్షన్ లు ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

కరోనా విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, పీక తీసుకోవాలని మాస్కు ధరించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ, శాసనమండలి ప్రోటం చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు చింత ప్రభాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ జయమ్మ, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షి షా, అధికారులు,ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

చురుకుగా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పనులు

Satyam NEWS

గాడిద మొహానికి కేసీఆర్ ఫొటో పెట్టిన కాంగ్రెస్ నాయకుడి అరెస్టు

Satyam NEWS

టీడీపీలో చేరిన పాడేరు నియోజకవర్గ వైసీపీ సర్పంచులు

Satyam NEWS

Leave a Comment