నారాయణపేట జిల్లా కేంద్రంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశ వర్కర్స్ కు, వైద్య సిబ్బంది కి మంగళవారం రోజు సంతోషమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్కులు ,శానిటైజర్స్ పంపిణీ చేశారు .
ఈ సందర్భంగా సంతోషమ్మ హాస్పిటల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ జే డి కరుణాకర్ మాట్లాడుతూ కరోన కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న ప్రాణదాత లకు తన వంతు సాయంగా శానిటైజర్స్ మస్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి సిఐటియు జిల్లా కార్యదర్శి బాల్ రామ్ డాక్టర్ మోనిష్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు శివశేషమ్మ, జయంతి, ఆశాలు హైమావతి , అరుణ తదితరులు తో పాటు 50 మంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.