సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గాడిద మొహానికి ఆయన ఫోటో ను పెట్టి జంతు హింసకు పాల్పడినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తీసుకువచ్చిన గాడిదను కూడా దొంగిలించినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. మూగ జీవిని హింసిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన లో కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు కరీంనగర్ అదనపు డిసిపి లా అండ్ ఆర్డర్ శ్రీనివాస్ తెలిపారు. సతీష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. శుక్రవారం పోలీసు కమిషనరేట్ కాన్ఫరెన్స్ హల్లో మీడియా సమావేశంలో అదనపు డీసీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్దతిలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని కానీ ఎదుటి వారి మనోభావాలను దెబ్బతీయకుండా..ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా ఉండాలని..సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా చేపల వ్యాన్ లో గాడిదను తీసుకొచ్చి, గాడిద మొహానికి సీఎం కేసీఆర్ ఫోటో పెట్టి మూగజీవి తో అమానుషంగా ప్రవర్తించడం పై ఐటి..జంతు హింస కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ విజ్ఞాన్ రావు, ఎస్సై ఎల్లయ్య గౌడ్ ఉన్నారు.
previous post