ములుగు మండలం లోని జంగాల పల్లిలో గ్రామ సర్పంచ్ మసరగాని అనిత రాణి ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామస్తులకు తడి చెత్త , పొడి చెత్త వేరు చేయుట గురించి అవగాహన కల్పించారు.
అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలందరూ ఇంటిని ఏవిధంగా శుభ్రంగా ఉంచుతమో అదేవిధంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు.
అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది పాలకవర్గం సభ్యులతో కలిసి గ్రామంలో ఇంటి ఇంటికి పోస్టర్స్ అంటించారు.
గ్రామంలోని ఎస్సీ కాలనీకి స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి మొక్కలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమములో గ్రామ, ప్రత్యేక అధికారిణి నవత వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి చిరంజీవి, ఏఎన్ఎం, ఆశాలు అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.