27.7 C
Hyderabad
April 26, 2024 06: 54 AM
Slider మెదక్

అరాచకాలను సృష్టించేవారిని ఎందుకు అరెస్టు చేయడం లేదు?

#BandiSainjai

హైదరాబాద్ లో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొన్ని అరాచక శక్తులు కుట్ర చేస్తున్నట్లు పక్కా సమాచారం ఉందని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి వాళ్లను ఎందుకు అరెస్టు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ప్రశ్నించారు.

బీజేపీకి వందకు పైగా సీట్లు గెలుస్తుందని సర్వేలు రావడంతో భయపడిన ముఖ్యమంత్రి భయాందోళనలు సృష్టించి ఓటర్లు ఓటేసేందుకు రాకుండా ఉండేందుకే ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. రేపటి నుండి 3 రోజుల పాటు బీజేపీ అగ్రనేతలు హైదరాబాద్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో వారి పర్యటనలను అడ్డుకునేందుకు కేసీఆర్ ఇలాంటి దుష్ట పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పటాన్ చెరులో జరిగిన బహిరంగ సభలో శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, బీజేపీ తమిళనాడు ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, పార్టీ అధికార ప్రతినిధి రాకేష్, జిల్లా పార్టీ అధ్యక్షులతో కలిసి ఆయన పాల్గొన్నారు.

సీఎంకు తొత్తులుగా మారిన పోలీసు అధికారులు

కులమత విద్వేషాలు రెచ్చగొట్టేదెవరో పక్కా సమాచారముంటే అరెస్టు చేయండని ఆయన సవాల్ చేశారు. సీఎంకు తొత్తులుగా మారిన కొందరు పోలీసు అధికారుల తీరును చూసి తీవ్ర వాదులు, నక్సలైట్ల చేతుల్లో అమరులైన పోలీసు అధికారుల ఆత్మలు ఘోషిస్తున్నాయని బండి సంజయ్ అన్నారు.

పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిట్స్ అంశంపై వస్తున్న విమర్శలపై సంజయ్ ఘాటుగా స్పందించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి అక్రమంగా హైదరాబాద్ వచ్చిన వలస వాదులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే తప్పనిసరిగా బీజేపీ పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్స్ చేసి తీరుతాం అని ఆయన అన్నారు. రోహింగ్యాలను  తరిమికొడతాం.

నా వ్యాఖ్యలు తప్పయితే మీకు దమ్ముంటే నన్ను అరెస్టు చేసుకోండి అని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. సాక్షాత్తు తెలంగాణ హోం మినిస్టరే హైదరాబాద్ లో రోహింగ్యాలున్నారని లెక్కలతో సహా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి వాళ్లను పంపివ్వాలా? లేదా? అని ప్రశ్నించారు.

ఫాం హౌస్ లో జల్సాలు చేస్తున్న సీఎం

నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుంటే వందల కోట్లతో ప్రగతి భవన్, ఫాంహౌజ్ కట్టుకుని సీఎం కేసీఆర్ జల్సా చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పాత సచివాలయం స్థానంలో కడుతున్న కొత్త సచివాలయం డిజైన్ ను చూపించిన  సంజయ్ 750 కోట్లతో నిర్మిస్తున్నారని నిలువ నీడలేక అల్లాడుతున్న పేదోళ్లకు ఇల్లు కట్టి ఇవ్వడానికి డబ్బుల్లేవనే ఈ దుర్మార్గపు, దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఉన్న సచివాలయాన్ని కూల్చేసే కొత్త సెక్రటేరియట్ పేరు మీద వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

ఇట్లాంటి నీచమైన సీఎంను ఏమనుకోవాలి? బ్యాలెట్ తో బుద్ది చెప్పి తెలంగాణ నుండి తరిమికొట్టాలా? వద్దా? మీరే చెప్పండి’’అని ప్రశ్నించారు. పాతబస్తీలో నల్లా, కరెంటు బిల్లులు, ఆస్తి పన్నులు వసూలు చేసే దమ్ము  మీకుందా? అని నిలదీశారు.భాగ్యనగర్ లో హిందువులు బిల్లు కట్టడం ఒక్కరోజు ఆలస్యమైతే కరెంట్, నల్లాలు కట్ చేసే మీరు….పాతబస్తీలో నెలలు, ఏళ్ల తరబడి బిల్లులు కట్టకపోయినా నోరెందుకు మెదపడం లేదు? అని ప్రశ్నించారు. హిందువులంటే మీకంత చులకనగా కనబడుతున్నరా ? ఎందుకింత వివక్ష?’’అని నిలదీశారు.

Related posts

కరోనా కష్ట కాలంలోనూ ఆపకుండా సంక్షేమం

Satyam NEWS

తిరుమలలో మరింత పెరిగిన భక్తుల రద్దీ

Bhavani

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఇది

Satyam NEWS

Leave a Comment