దసరా మహోత్సవాల వివరాలను తెలియచేస్తూ ఇంద్రకీలాద్రి లోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నేడు దసరా మహోత్సవాల కరపత్రిక ఆవిష్కరించారు. దేవస్థానం మహా మండపం 6 వ అంతస్తు లో ఆలయ పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ ఈ కరపత్రికను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఎన్. సుజాత, వైదిక కమిటీ సభ్యులు ఆర్.శ్రీనివాస శాస్త్రి, ప్రధానార్చకులు మల్లేశ్వర శాస్త్రి, ఉపప్రధానార్చకులు శంకర శాండిల్య, సహాయ కార్యనిర్వహణాధికారులు బి.వెంకటేశ్వర రెడ్డి, ఎం.తిరుమలేశ్వర రావు, పర్యవేక్షకులు డి.వి.వి.సత్యనారాయణ పాల్గొన్నారు.