బిచ్కుంద మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు.
అందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని ఈ ప్రతిజ్ఞలో సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శంకర్, ఆరోగ్య బోధకులు దస్థిరం, ఆరోగ్య కార్యకర్తలు గంగామణి, బాల బాయి ఆశా కార్యకర్తలు విజయ, పద్మ తదితరులు పాల్గొన్నారు.