టాలీవుడ్ స్టార్స్ ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాను సెట్స్పైకి తీసుకొచ్చేవారు. ఇప్పుడా రూల్ను పూర్తిగా పక్కనపెట్టేశారు. ఒకేసారి రెండు, మూడు సినిమాలు చేస్తూ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నారు. అందులో భాగంగానే స్టార్ హీరో ప్రభాస్ కి వరుస అపజయ అవుతున్నా.. సినిమా లైనప్లు మాత్రం బాగున్నాయి. ఒకేసారి మూడు, నాలుగు సినిమాల్లో నటిస్తూ ప్రభాస్ అభిమానులను అలరించబోతున్నాడు.
బాహుబలితో వచ్చిన క్రేజ్ ను పాన్ ఇండియా రేంజ్ లో బాగా విస్తరించుకున్నాడు ప్రభాస్. బాహుబలి రెండు భాగాలతో ఇండియా మొత్తం మోస్ట్ ఫేవరెట్ స్టార్ అయిపోయాడు. గ్లోబల్ వైడ్ గానూ మంచి అప్రిసియేషన్ దక్కించుకున్నాడు.
యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దాంతో ప్రభాస్ కి ఇండియాలో తిరుగులేని మార్కెట్ వచ్చిపడింది. ఆ క్రేజ్ తోనే ‘సాహో’ మూవీకి భారీ హైప్ క్రియేట్ అయింది. బాహుబలిని మించే కలెక్షన్స్ ఊహించారు. అయితే ఈ సినిమాతో ప్రభాస్ సౌత్ మార్కెట్ దెబ్బతింది. ఇక్కడ ఫ్లాపయినా నార్త్ లో అదరగొట్టింది సాహో. నార్త్ లో సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి.
అయితే సాహో ఫెయిల్యూర్ ఎఫెక్ట్ నెక్స్ట్ మూవీ రాధేశ్యామ్ పై ఏ మాత్రం పడలేదు. సినిమా మేకింగ్ కు చాలా కాలం పట్టింది. కరోనా వల్ల రిలీజ్ కాస్త లేటయినప్పటికీ సినిమాకి సూపర్ క్రేజ్ వచ్చి పడింది. ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్ లో వచ్చాయి. అయితే ఈ మూవీ కూడా అందరినీ పూర్తిగా డిజప్పాయింట్ చేసింది.
తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా చేసిన ఈ లవ్ స్టోరీతో ఫ్యాన్స్ ను మెప్పించలేకపోయాడు ప్రభాస్. ఈ మూవీ బాలీవుడ్ లో కూడా సేమ్ రిజల్ట్ రాబట్టింది. రాధేశ్యామ్ ఏకంగా డిజాస్టర్ లిస్ట్ లోకి చేరింది. ఈ రెండు సినిమాలతో ప్రభాస్ కు వరుస ఫ్లాప్స్ ఎదురయ్యాయి అనుకుంటే లిస్ట్ లోకి లేటెస్ట్ గా రిలీజైన ఆదిపురుష్ మూవీ కూడా చేరిపోయింది.
ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ వరుసగా అయిదు ప్రాజెక్ట్లలో నటిస్తున్నాడు. మరో అందులో 3 ప్రాజెక్ట్స్ లైన్లో ఉండగా మరో 2 సినిమా లు సెట్స్ పైకి రానున్నాయ్… రీసెంట్గా రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్
జూన్ 16న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి తొలి షో నుంచే డివైడ్ టాక్ మొదలైంది. అయినా సరే వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు రూ. 400 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది.
ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ మరో మూడు క్రేజీ ప్రాజెక్ట్లలో నటిస్తున్నారు. కేజీఎఫ్
ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్
లో నటిస్తుండగా ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 29న పాన్ ఇండియా మూవీగా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ ఆవుతోంది. ఇప్పటికే అంచనాలు పతాక స్థాయికి చేరడంతో అభిమానులు, సినీ లవర్స్ దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. త్వరలో టీజర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ మూవీతో పాటు నాగ్ అశ్విన్తో ప్రాజెక్ట్ కె
చేస్తున్న ప్రభాస్ దీనికి తోడు మారుతి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్కు జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్ ఇందులో ప్రభాస్కు జంటగా కనిపించనున్నారు. కీలక ఘట్టాల షూటింగ్తో మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది.
మిగతా సినిమాల్లో నటిస్తూ ఈ మూవీ కోసం ప్రభాస్ మధ్యలో డేట్స్ కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్గా మారింది. కామెడీ హారర్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా కోసం రాజా డీలక్స్
అనే టైటిల్ని ఫైనల్ చేస్తున్నారంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది.
అయితే తాజాగా టైటిల్ కాకుండా రాయల్
, అంబాసిడర్ అనే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే టీమ్ మాత్రం రాజా డీలక్స్
వైపే ఆసక్తి చూపిస్తోందని, ఆ టైటిల్నే ఫైనల్ చేస్తుందని ఇన్ సైడ్ టాక్. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆయన క్యారెక్టర్ ప్రభాస్కు తాతగా కనిపిస్తుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన విశేషాలని చిత్ర భృందం అధికారికంగా ప్రకటించనుంది.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాకు చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. ఈ యేడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను సరికొత్త కాన్సెప్ట్తో ప్రభాస్ 25వ మూవీగా రానుంది. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా తెలుగులో డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
హిందీలో ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’, పఠాన్ వంటి యాక్షన్ చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్.. యూవీ క్రియేషన్స్, యశ్ రాజ్ ఫిల్మ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. సుధ కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే సుధ కొంగర ప్రభాస్ కలిసి స్టోరీ లైన్ను ఓకే చేయించుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.