మింట్ కాంపౌండ్ లో మిస్ ఫైర్ కావడంతో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామయ్య (49)మృతి చెందారు. మింట్ కాంపౌండ్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో సుమారు నాలుగున్నర సంవత్సరాలుగా సెక్యూరిటీగా రామయ్య పని చేస్తున్నారు. తుపాకిని శుభ్రం చేస్తుండగా ఫైర్ అయినట్లుగా అధికారులు తెలిపారు.
మిస్ ఫైర్ కారణంగా తీవ్ర గాయాలైన రామయ్యను కేర్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే కానిస్టేబుల్ రామయ్య అక్కడికక్కడే మృతి చెందారు. రామయ్య ప్రస్తుతం రామంతాపూర్ లో నివాసం ఉంటున్నారు. ఆయన స్వస్థలం మంచిర్యాల.