38.2 C
Hyderabad
May 5, 2024 21: 43 PM
Slider మహబూబ్ నగర్

అగ్నికి ఆహుతి అయిన జిల్లా పంచాయతీ కార్యాలయం

#fire

జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైంది. సోమవారం గద్వాల జిల్లా పంచాయతీ కార్యాలయం పలు అనుమానాలను రేకెత్తిస్తూ జిల్లా కార్యాలయం అగ్నికి ఆహుతి అయ్యింది.కార్యాలయం లో చెలరేగిన మంటలకు కంప్యూటర్లు, ఫైల్స్, దగ్ధమైనట్లు, ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కార్యాలయం తాళాలు పగులగొట్టి ఉండటంతో కావాలనే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కార్యాలయాన్ని చేరుకొని పరిశీలించారు.జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారితో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.  ఎవరో గుర్తు తెలియని దుండగులు కార్యాలయం తాళాలు పగులగొట్టి కావాలని ఈ పని చేశారనే అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపించి కారణమైన వారికి వెంటనే శిక్షించాలని పోలీస్ లకు సూచించారు.

ఎమ్మెల్యే గారి వెంట కె.టి దొడ్డి మండల వైస్ ఎంపీపి రామకృష్ణ నాయుడు, ధరూర్ మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు రఘవర్ధన్ రెడ్డి, మల్డకల్ మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి నవీన్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారి శ్యామ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

భారత్ ఓ ఆశాదీపం!

Satyam NEWS

యుద్ధానికి సిద్ధం: ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

Bhavani

అంబర్ పేట్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం

Bhavani

Leave a Comment