వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుండి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించవలసినదిగా సంబంధిత పోలీస్ అధికారులను పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఆయన నేడు ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) G. బిందుమాధవ్, దిశా డిఎస్పీ U. రవిచంద్ర, గురజాల డిఎస్పీ జయరాం ప్రసాద్, నరసరావుపేట డిఎస్పీ విజయభాస్కరరావు, సీఐ సుభాషిణి, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
previous post