ప్రకాశం గిద్దలూరు నియోజకవర్గం లోని అర్ధవీడు మండలం మాగుటూరు, కాకర్ల, వెలగలపాయ గ్రామాల సమీపంలో పెద్దపులి సంచారం కనిపించింది. ఈ సంఘటన ఆ గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే పులి ఒక ఆవును చంపి తినగా వెలగల పాయ గ్రామంలో మంగళవారం నాడు మరో ఎద్దు పై పులి దాడి చేసింది.
రైతుల కేకలు వేయడంతో పెద్దపులి అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. పెద్దపులి సంచారంతో మూడు గ్రామాల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నారు.