33.2 C
Hyderabad
May 4, 2024 01: 33 AM
Slider విజయనగరం

గొప్ప దేశభక్తుడు పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ…!

#deendayal

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులలో ఒకరైన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా విజయనగరం  జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి  ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బీజేపీ మాజీ అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రబోధించిన ఏకాత్మతా మానవతావాదం సిద్ధాంతం ఆధారంగానే మన ప్రధాని నరేంద్రమోడీ అంత్యోదయ (సబ్కాసాథ్ సబ్కావికాస్)అందరితో  కలసి అందరి అభివృద్ది అనే నినాదంతో దేశాన్ని ప్రగతి పధంలో నడిపిస్తున్నారని అన్నారు. 

అంత్యోదయ అంటే సమాజం లో అట్టడుగు స్థానం లో ఉన్న వ్యక్తి సంక్షేమం, దీనజనోద్ధరణ, దేశంలో అత్యంత నిరుపేదల కోసం ముద్ర యోజన, జన్ధన్ యోజన, ఉజ్వల యోజన( పేదలకు ఉచిత గ్యాస్) గ్రామ జ్యోతి పథకం, ఇళ్ల నిర్మాణం, జనరిక్ ఔషధాలు, వైద్య బీమా పంటల బీమా పథకాలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం జరుగుతుందని అన్నారు. రైతుల   ఆదాయాన్ని రెట్టింపు చేసే సాయిల్ హెల్త్ కార్డ్ పథకం, పంటల బీమా పథకం,జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం,కిసాన్ టీవీ చానల్స్ తో పాటు రైతుల  జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కేంద్ర బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాణంగపల్లి అశోక్,అల్లూరి రామకృష్ణ రాజు, కుసుమంచి సుబ్బారావు సౌత్ మండల అధ్యక్షులు ఇప్పిలి గొపాల కృష్ణ,  వెస్ట్ మండల అధ్యక్షులు గిరి, ఆదిల్ , కొల్లి కుర్మా రావు, లక్ష్మి నరసింహం , మహిళ మోర్చా గండి కోట శాంతి, నీలాపు దేవి, పాకరాని నాగ మల్లిక, శ్రీదేవి, బండారు సాయి, కృష్ణ వేణి, వెంకటలక్ష్మి, యువ మోర్చా పిల్ల నవీన్ , గోలగాన రమేష్ ,మజ్జి రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఎటాక్: పోలీస్ స్టేషన్ ను బాంబు పెట్టి పేలుస్తా

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడుగా సోము వీర్రాజు

Satyam NEWS

చిన్న తిరుపతిని సందర్శించిన ఎమ్మెల్యేలు

Satyam NEWS

Leave a Comment