33.7 C
Hyderabad
April 29, 2024 00: 26 AM
Slider కడప

కడపనే అభివృద్ధి చేయలేని సీఎం జగన్

#CM Jagan

కడప పట్టణంలోని 40 డివిజన్ ఎస్బిఐ కాలనీ మరి పురం లో చిన్నపాటి వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఈ విధంగా అభివృద్ధికి నోచుకోలేదు అంటే రాష్ట్రం ఏ విధంగా ఉందో ఆలోచించుకోవాలని ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిమండలం విజయ్ సుశీల్ తెలిపారు.

డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకుండాపోవడం వలన ఎస్బిఐ కాలనీ మరి పురం లో చిన్నపాటి వర్షానికి రోడ్లు మునిగిపోతున్నాయని ఆయన అన్నారు. కడపనే అభివృద్ధి చేసుకోలేని ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా చేస్తారో చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని, అతి త్వరలోనే ప్రజలు ఆయనకు చరమగీతం పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాస్కో, మధు, పుత్తూరు రాజు, శబ్బు, పాల్గొన్నారు

Related posts

క‌విత‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి అల్లోల‌

Satyam NEWS

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఇన్వెస్టర్ బ్రాండ్ అంబాసిడర్ గా హవా ఫాన్స్

Satyam NEWS

కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా?

Satyam NEWS

Leave a Comment